నరసాపురంలో 134 కేసులు రాజీ

53చూసినవారు
నరసాపురంలో 134 కేసులు రాజీ
నరసాపురం కోర్ట్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 134 కేసులు పరిష్కరించినట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, 10వ అదనపు జిల్లా జడ్జి పి. విజయ దుర్గ తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడారు. మోటార్ వాహన ప్రమాద భీమా కేసులను గతంలో ఏలూరు జిల్లా కోర్ట్‌కి వెళ్లకుండా ఇక్కడ నుంచే మైక్రో సాఫ్ట్ టీమ్ యాప్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో మాట్లాడి రాజీ చేసుకోవడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్