పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

63చూసినవారు
పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఇరగవరం మండలం గోటేరులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధికారులతో కలిసి మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పండగలా పింఛన్ పంపిణీ చేసి అవ్వా, తాతల ముఖాల్లో ఆనందాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రూ. 1000 పింఛన్ పెంచడానికి గత వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టిందని, ఒకేసారి పెంచిన పింఛన్లు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు.

సంబంధిత పోస్ట్