ఎండలు విపరీతంగా ఉన్నందున ఉపాధి హామీ పథకం కూలీలు అనారోగ్యానికి గురికాకుండా ఉదయం 5.30 నుంచి 10.30 వరకే పనులను నిర్వహించాలని ఏపీ సీఎస్ జవహర్రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. అలాగే, వారికి పెద్ద ఎత్తున పనులు కల్పించాలని ఆదేశించారు. జూన్ నెలాఖరు వరకు కరవు మండలాల్లో తాగు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, మంచినీటి పథకాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.