వైఎస్‌ఆర్ ప్రజా ప్రస్థానం ముగింపు ఇచ్ఛాపురంలోనే జరిగింది: షర్మిల

79చూసినవారు
వైఎస్‌ఆర్ ప్రజా ప్రస్థానం ముగింపు ఇచ్ఛాపురంలోనే జరిగింది: షర్మిల
వైఎస్‌ఆర్ ప్రజా ప్రస్థానం ముగింపు ఇచ్ఛాపురంలోనే జరిగిందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇచ్ఛాపురం వైఎస్‌ఆర్‌ స్తూపం వద్ద నివాళులు అర్పించి మాట్లాడారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నుంచే పుట్టినవే ఆరోగ్య శ్రీ, రుణమాఫీ, ఉచిత విద్యుత్, పక్కా ఇళ్లు అన్నారు. వైఎస్‌ఆర్‌ సీఎం అయ్యాక 46 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారని, వైఎస్‌ఆర్ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే ఇచ్ఛాపురం ఎంచుకున్నానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్