నిందితులని తుపాకీతో కాల్చి చంపండి: మధ్యప్రదేశ్ పోలీసులను కోరిన అత్యాచార బాధితురాలు

60చూసినవారు
నిందితులని తుపాకీతో కాల్చి చంపండి: మధ్యప్రదేశ్ పోలీసులను కోరిన అత్యాచార బాధితురాలు
మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఇటీవల ఇద్దరు ట్రెయినీ ఆర్మీ ఆఫీసర్లు తమ స్నేహితురాళ్లతో కలిసి పిక్నిక్ కు వెళ్లగా.. ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటనపై ఓ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేసింది. "నిందితులని తుపాకీతో కాల్చేయండి లేదంటే నన్ను చంపండి" అని ఆమె పోలీసులను కోరింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ అధికారులపైనా కూడా నిందితులు దాడి చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్