వ‌ర‌ద బీభ‌త్సం.. పోలీస్ స్టేష‌న్ బుర‌ద‌మ‌యం

64చూసినవారు
ఏపీలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌దలు బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ వ‌ర‌ద‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ‌చ్చింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని నున్న పోలీస్ స్టేషన్ లో వ‌ర‌ద సృష్టించిన బీభ‌త్సం బ‌య‌ట‌ప‌డింది. స్టేష‌న్‌లోని గదులు, ఆవరణలో బురద పేరుకుపోయింది వరద నీటిలో త‌డ‌వ‌డంతో ఫర్నిచర్, కంప్యూటర్లు, ఫైల్స్ ప‌నికిరాకుండా పోయాయి. ప్ర‌స్తుతం పోలీస్ స్టేష‌న్‌ను అధికారులు శుభ్రం చేయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్