అల్లూరి జిల్లా అరకు లోయ మండలం నందవలసలో ఘోర ప్రమాదం జరిగింది. మూడు బైకులు అదుపు తప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. స్పాట్ లోనే ముగ్గురు దుర్మరణం చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు మృతి చెందాడు. మహాశివరాత్రి సందర్భంగా నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరిగింది. ఈ జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.