విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సర్వీసులు

55చూసినవారు
విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సర్వీసులు
విజయవాడ నుంచి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును మంత్రి టి.జి భరత్ కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ నుంచి కర్నూలు ఎయిర్‌పోర్టుకు విమానసౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు టి.జి భరత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్