ఇండోర్లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలిక తన ఇంటి బయట రోడ్డు దాటుతుండగా మునిసిపల్ కార్పోరేషన్ సిబ్బంది తవ్విన గొయ్యిలో పడింది. అందులో నీరు నిండుగా ఉండటంతో ఆ బాలిక మునిగిపోయింది. సకాలంలో బాలిక పైకి లేచి గొయ్యి అంచును పట్టుకోగా ఓ బాలుడు వచ్చి ఆమె ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన గత నెల 29న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవడంతో.. సంబంధిత కాంట్రాక్టర్కు రూ.లక్ష జరిమానా, సబ్ ఇంజనీర్ జీతంలో కోత విధించినట్లు సమాచారం.