టీడీపీ గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్?

58చూసినవారు
టీడీపీ గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్?
AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి షాక్‌‌‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా చేశారు. అయితే ఆయన త్వరలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకెవరెవరు పార్టీ వీడనున్నారో చూడాలి.

సంబంధిత పోస్ట్