రామాపురం బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతు

77చూసినవారు
రామాపురం బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతు
AP: బాపట్ల జిల్లా రామాపురం బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. సముద్ర స్నానానికి దిగిన యువ‌కులు అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. గల్లంతైన యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌ల్లంతైన నలుగురు యువకులు నెల్లూరు నుంచి రామాపురం బీచ్ వచ్చినట్లు ప్రాథ‌మిక స‌మాచారం.

సంబంధిత పోస్ట్