AP: రాష్ట్రంలోని మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే ఈ పథకం అమలవుతున్నందున.. మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రవేశపెడతామని తెలిపారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వివరించారు.