చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ను అడ్డుపెట్టుకుని వాలంటీర్లపై కుట్ర చేశారని, ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వడాన్ని అడ్డుకుని ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని అన్నారు. ఇన్ని నెలలు వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందని నిలదీశారు. వికలాంగులకు, పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బాబును దేవుడు కూడా క్షమించడని మండిపడ్డారు.