AP: గ్రూప్-2 అభ్యర్థులకు శుభ‌వార్త

274721చూసినవారు
AP:  గ్రూప్-2 అభ్యర్థులకు శుభ‌వార్త
గ్రూప్-2 పరీక్ష రాసే అభ్య‌ర్థుల‌కు SBI శుభ‌వార్త చెప్పింది. ఈ నెల 25న ఇత‌ర ప‌రీక్ష‌లు ఉన్న‌వారు క్లర్క్ పరీక్షను మార్చి 4న రాసుకోవ‌చ్చని తెలిపింది. వెబ్‌సైట్‌లో ఉంచిన లింక్ ద్వారా ఈ నెల 23న ఉద‌యం 9 గంట‌ల‌లోపు ప‌రీక్ష తేదీని మార్చుకోవ‌చ్చ‌ని పేర్కొంది. ఫిబ్ర‌వ‌రి 25న గ్రూప్‌-2తో పాటు SBI క్లర్క్ పరీక్ష ఉండ‌టంతో ఏదో ఒక ప‌రీక్ష మాత్ర‌మే రాసే వీలుంది. దీంతో క్లర్క్ పరీక్షను మార్చి 4న నిర్వహించాలని SBIని APPSC కోరింది.

సంబంధిత పోస్ట్