ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీ: టీడీపీ నేత పట్టాభి

75చూసినవారు
ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీ: టీడీపీ నేత పట్టాభి
పంపిణీపై వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయరాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత పట్టాభి సీతారాం మండిపడ్డారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఈసీ చెప్పలేదని.. కేవలం వాలంటీర్లు మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయొద్దని చెప్పిందన్నారు. కావాలనే వైసీపీ నేతలు కుట్రకు తెరలేపారని విమర్శించారు. ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీ అయ్యిందని.. అందుకే సీఎం జగన్ పెన్షన్లు పంపిణీ చేయట్లేదని ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్