కొరిశపాడు: అధ్వానంగా రావినూతల రహదారి

50చూసినవారు
కొరిశపాడు: అధ్వానంగా రావినూతల రహదారి
కొరిశపాడు మండలం రావినూతల నుంచి దైవాలరావూరు వెళ్లే రహదారి అద్వానంగా మారింది. దారి పొడవునా అడుగడుగునా లోతైన గుంతలు ఉండటంతో రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నామని పలువురు వాహన చోదకులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడటంతో గుంతలు కనిపించక ప్రమాదాలకు గురవుతున్నామని వారు వాపోయారు. దీనికి తోడు ద్విచక్ర వాహనాలు కూడా మరమ్మత్తులకు గురవుతున్నాయన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్