ముగ్గులతో నిరసన తెలిపిన అంగన్వాడీలు
అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 35వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా చేబ్రోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు సంక్రాంతి ముగ్గులు వేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ ముగ్గుల చుట్టు తిరుగుతూ బతుకమ్మ, కోలాటం ఆటలు ఆడి తమ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.