వైసీపీ నాయకులపై టీడీపీ దాడులు పెరుగుతున్నాయి

54చూసినవారు
టీడీపీ అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు ప్రారంభించారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అన్నారు. తన కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ వాళ్లపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత టీడీపీ ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసురత్నం, సూరి ఫాతిమా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్