గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

58చూసినవారు
గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్
భద్రాచలం, ఒరిస్సా ప్రాంతాలలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధిక ధరకు అమ్ముతున్న షేక్ కరీముల్లా, చల్లా ఈశ్వరరావు, బత్తుల శ్రవణ్ కుమార్లను గుంటూరు పీకలవాగు డంపింగ్ యార్డ్ వద్ద సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని లాలాపేట సీఐ దేవ ప్రభాకర్ తెలిపారు. గంజాయి క్రయవిక్రయాలు జరిగినా, సేవించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్