Mar 27, 2025, 11:03 IST/
టిక్కెట్లు లేని 2.16 కోట్ల మంది నుంచి రూ.562.40 కోట్లు వసూలు
Mar 27, 2025, 11:03 IST
భారతీయ రైల్వేలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో టికెట్ లేకుండా ప్రయాణించిన 2.16 కోట్ల మందిని గుర్తించి, వారినుంచి ₹562.40 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది రైల్వే శాఖ తన పరిపాలనా వ్యవస్థను మెరుగుపర్చేలా కృషి చేస్తుందనే సంకేతంగా చెప్పొచ్చని విశ్లేషకులు అంటున్నారు. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల నియంత్రణ కోసం రైల్వే అధికారులు కఠినమైన తనిఖీలు చేపడుతున్నారు.