జీజీహెచ్ లో 'స్వచ్ఛత హి సేవ' కార్యక్రమం

84చూసినవారు
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఆదివారం "సచ్ఛత హి సేవ" కార్యక్రమం జరిగింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తోటి ఉద్యోగులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళాలంటే ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. డాక్టర్ కిరణ్, ప్రవీణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్