మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఏఎస్పీ

73చూసినవారు
మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఏఎస్పీ
గుంటూరు పోలీస్ కార్యాలయంలో గురువారం అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకుమాను వారితోట, డొంక రోడ్డు, బొంగరాల బీడు తదితర ప్రాంతాల్లో మత్తుపదార్థాలకు అలవాటు పడిన యువకులకు వేర విభాగ ఏఎస్పీ శ్రీనివాసరావు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలతో యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మరోసారి మత్తు పదార్థాలు సేవిస్తున్నట్లు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్