గుంటూరులో వైసీపీ కార్పొరేటర్ల నిరసన

61చూసినవారు
గుంటూరులోని 54 డివిజన్ లో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం పట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. తన డివిజన్లో ఎలాంటి అనుమతులు లేకుండా శిలాఫలకాలు ఎందుకు ధ్వంసం చేశారంటూ స్థానిక కార్పొరేటర్ మల్లవరపు రమ్య కౌన్సిల్ సమావేశంలో బైఠాయించారు. ఈ ఆందోళనకు వైసీపీ కార్పొరేటర్లు సంఘీభావం తెలుపుతూ మంగళవారం ప్లకార్డులు ప్రదర్శించారు. ధ్వంసం చేసిన శిలాఫలకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్