వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

59చూసినవారు
వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
వివాహిత అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ భాస్కర్ తెలిపారు. గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన వివా హిత కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇద్దరు బిడ్డలను తీసుకుని ఈనెల 16వ తేదీ అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్ల వద్ద విచారణ చేసినా ఫలితం లేకపోవడంతో బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్