గురజాల నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్, కాల్ సెంటర్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం దాచేపల్లిలో ఉమ్మడి కూటమి ఆత్మీయ సమావేశంలో ప్రసంగించారు. తనకోసం కష్టపడ్డ వారి జాబితా తన వద్ద ఉందని, వారు కష్టాల్లో ఉన్నప్పటికీ వారికి సహాయం అందుతుందన్నారు. అక్రమాలు చేసిన వారి జాబితా కూడా ఉందని వారిని చట్టబద్ధంగా శిక్షిస్తామన్నారు.