మాచర్ల: నాగర్జునసాగర్ 8 క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల

82చూసినవారు
మాచర్ల మండలం నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు 8 క్రస్ట్ గేట్లను ఎత్తి శనివారం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి లక్ష క్యూసెక్కులకు పైగా భారీగా ఇన్ ప్లో కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమై 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 64, 800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 590. 00 అడుగులుగా ఉంది.

సంబంధిత పోస్ట్