విచారణకు సహకరించని నందిగం సురేష్

58చూసినవారు
విచారణకు సహకరించని నందిగం సురేష్
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్ ను మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన విచారణకు మాజీ ఎంపీ నందిగం సురేష్ సహకరించలేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా తనకేమీ తెలియదు అన్నట్లు సురేష్ వ్యవహరించారని విశ్వసనీయ సమాచారం. కాగా సురేష్ పోలీసులు రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు విచారించనున్నారు.

సంబంధిత పోస్ట్