తాడేపల్లిలో గంజాయి స్వాధీనం.. ముగ్గురిపై కేసు నమెదు

84చూసినవారు
తాడేపల్లి సీతానగరంలో గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానాడుకు చెందిన ముగ్గురు యువకులు విశాఖ నుండి గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని కేజీ600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్