రోడ్ల మీదకు రావద్దు, హంగామా చేయొద్దు: ఎస్సై సురేష్

557చూసినవారు
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈనెల మూడో తేదీ సాయంత్రం నుండి 5వ తేదీ సాయంత్రం వరకు మండల వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని వేటపాలెం ఎస్సై జి. సురేష్ అదివారం మీడియాకు చెప్పారు. ఎవరూ ఇళ్ళు వదిలి బయటకు రారాదని, రెండు రోజుల పాటు అవసరమైన నిత్యావసరాలను ముందుగానే నిల్వ చేసుకోవాలని ఆయన సూచించారు. దుకాణాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. జనాలు గుంపులుగా తిరిగినా, బాణాసంచా కాల్చినా కఠిన చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్