పంట పొలాలను పరిశీలించిన వైసిపి బృందం..

53చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతంలోని జి బి సి రోడ్డు కట్టెంపూడి శివారు భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను సోమవారం పొన్నూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆ పార్టీ నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు. రైతులను కలిసి పంట నష్టం ఎంత జరిగిందని అడిగి తెలుసుకున్నారు. పంట నీటమునిగి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 20 వేలు చొప్పున నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్