పెదనందిపాడు మండలంలోని పలు గ్రామాలలో పోలీసు కవాతు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు, అన్నారం, రాజుపాలెం గ్రామాలలో మంగళవారం కేంద్ర పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ గీత, పెదనందిపాడు ఏఎస్ఐ నార్ని శ్రీనివాసరావు, ప్రత్యేక బలగాలు పాల్గొని సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.