ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ పిచ్ ఛేజింగ్కు అనుకూలంగా ఉందని, మొదట బౌలింగ్ చేసే జట్టు విన్ అయ్యే ఛాన్స్ ఉందని ఇరు జట్ల కెప్టెన్లు అభిప్రాయపడ్డారు.