బిసి కాలనీవాసుల సమస్యలు తీర్చండి మహాప్రభో..

68చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పెట్రోలు బంకు వెనుక ఉన్న బిసి కాలనీవాసుల సమస్యలు తీర్చాలని సోమవారం మీడియా ముందు వాపోయారు. 30 ఏళ్ల నుండి కాలనీలో ఉంటున్నామని కనీసం రోడ్డు సౌకర్యం, మంచి నీరు, డ్రైనేజీ వసతి లేదని ఆవేదన చెందారు. వర్షాకాలంలో వాగు పొంగి తీవ్ర అవస్థలు పడుతున్నామని ప్రభుత్వాలు మారిన తమ సమస్యలు తీరటం లేదని తెలిపారు. కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని వారు స్థానిక అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్