తేనెటీగల దాడిలో 30 మందికి గాయాలు

82చూసినవారు
తేనెటీగల దాడిలో 30 మందికి గాయాలు
AP: గణేశ్‌ నిమజ్జన ఊరేగింపు సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో 26 మంది చిన్నారులతో సహా 30 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లిలో చోటు చేసుకుంది. రాజోలు ప్రభుత్వాసుపత్రిలో 30 మందికి, అమలాపురం ఆసుపత్రిలో ఒకరికి చికిత్స అందిస్తున్నారు. తేనెటీగల దాడి సమయంలో పరుగెడుతుండగా ఐదుగురు చిన్నారులపై కుక్క దాడి చేసింది.

సంబంధిత పోస్ట్