ధూళిపాళ్లలో ఇరు వర్గాల ఘర్షణ

2217చూసినవారు
ధూళిపాళ్లలో ఇరు వర్గాల ఘర్షణ
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలోని భాగ్యనగర్ కాలనీలో గురువారం అర్థరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీకి చెందిన రెండువర్గాల మధ్య రేషన్ షాప్ పంపకం విషయంలో ఘర్షణ తలెత్తింది. వీరయ్య, కుమారి, అశోక్, చిన్నబ్బాయి, మరియ బాబు, అప్పలమ్మ, శాంసన్, రాజేష్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. గాయపడ్డవారిని సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్