సాగర్ కుడి కాల్వలో యువకుడి గల్లంతు.. గాలిస్తున్న పోలీసులు

66చూసినవారు
సాగర్ కుడి కాల్వలో యువకుడి గల్లంతు.. గాలిస్తున్న పోలీసులు
బొల్లాపల్లి మండలం సంగం బ్రిడ్జి తండా వద్ద సాగర్ కూడి కాల్వలో యువకుడు గల్లంతయ్యాడు. గండిగనమల తండాకు చెందిన రామవాత్ రవినాయక్ శుక్రవారం రాత్రి వినుకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విధులు ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అతనిని కాలువలోకి తోసేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై బండ్లమోటు పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం కాల్వలో గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్