పోలవరం జ‌న‌సేన MLA అభ్య‌ర్థి ఈయ‌నే

249021చూసినవారు
పోలవరం జ‌న‌సేన MLA అభ్య‌ర్థి ఈయ‌నే
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి మ‌రో MLA అభ్య‌ర్థిని జ‌న‌సేన పార్టీ ఖ‌రారు చేసింది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి జనసేన నేత చిర్రి బాలరాజు బ‌రిలో దిగ‌నున్నారు. బాలరాజుకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు నియామక పత్రాన్ని అందించారు. ఈ సంద‌ర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మూడు పార్టీల(టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ) శ్రేణుల‌ను కలుపుకొని పని చేస్తానని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్