కుప్పంలో భారీగా మద్యం పట్టివేత

588చూసినవారు
కుప్పంలో భారీగా మద్యం పట్టివేత
చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల వేళ భారీగా మద్యం పట్టుబడింది. కర్ణాటక నుంచి గుడుపల్లి మండలం సోడిగానీపల్లికి మద్యం తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.6 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు ముద్దాయిలు, ఒక ద్విచక్రవాహనం, కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్