హిమాచల్‌ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరి మృతి

60చూసినవారు
హిమాచల్‌ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరి మృతి
హోలీ పండుగ రోజున హిమాచల్ ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉనా జిల్లా అంబ్ సబ్ డివిజన్‌లోని మేడిలో హోలీ సంబరాలు జరుగుతుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడి ఉన్నవారు భయపడి పరుగెడుతున్న క్రమంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్