ఏపీలో రేపు 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 174 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత కొనసాగుతుందని, ఎల్లుండి 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 170 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకి వెళ్లకూడదని అధికారులు సూచించారు.