ఏపీలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా ప్రాంతంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే ఛాన్సుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.