ఏపీలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి

70చూసినవారు
ఏపీలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు. రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. విజయవాడలో ఈదురుగాలులతో చిరుజల్లులు కురిశాయి. ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అచ్చంపేట, అమరావతి, క్రోసూరు మండలాల్లో మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్