ఈ నెల 27 వరకు రాష్ట్రంలో తీవ్ర ఎండలు, ఉక్కపోతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర ఎండలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. శనివారం దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.