ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. వైసీపీ నేత గోసుల శివభారత్ రెడ్డి బాపులపాడు జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో.. జనసేన ఏజెంట్లను బయటికి పంపిస్తున్నారని జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరగడంతో పోలీసులు సర్దిచెప్పి.. అక్కడి నుంచి పంపించారు.