బోట్ల వ్యవహారంపై హోంమంత్రి అనిత సీరియస్

59చూసినవారు
బోట్ల వ్యవహారంపై హోంమంత్రి అనిత సీరియస్
విజయవాడ ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్యారేజీని ధ్వంసం చేయడానికి బోట్లను వినియోగించారు. బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయి. ఆ బోట్లు వైసీపీ నేతలు నందిగం సురేష్, తలశిల రఘురాం బంధువుల బోట్లుగా గుర్తించాం. విధ్వంసం చేయడానికి ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. విచారణలో తేలితే ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు. దేశద్రోహం కింద కేసులు పెడతాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్