రైలును పట్టాలు తప్పించేందుకు 70 కేజీల సిమెంట్ బ్లాక్‌లను రైల్వే ట్రాక్‌పై పెట్టిన దుండగులు

61చూసినవారు
రైలును పట్టాలు తప్పించేందుకు 70 కేజీల సిమెంట్ బ్లాక్‌లను రైల్వే ట్రాక్‌పై పెట్టిన దుండగులు
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గుర్తుతెలియని దుండగులు రైల్వే ట్రాక్‌పై 70 కిలోల బరువైన 2 సిమెంట్ దిమ్మెలను ఉంచి, గూడ్స్ రైలును పట్టాలు తప్పించేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాటిని ఢీకొంటూ ముందుకు వెళ్లిన రైలులో ఇంజిన్ తో పాటు కొంత భాగం దెబ్బ తిన్నప్పటికీ, దాని ప్రయాణానికి అంతరాయం కలగలేదు. కాగా, రైల్వే ఉద్యోగుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం యూపీలోనూ ఈ తరహా ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్