ఏపీలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ను ఓటర్లు పట్టించుకోలేదు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆయనకు.. సరిగ్గా ఓట్లు పడలేదు. గాజువాక MLA అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ఇప్పటివరకు 394 ఓట్లు రాగా, విశాఖ MP అభ్యర్థిగా నిలిచిన పాల్ 1190 ఓట్లు లభించాయి. దీంతో పాల్ కుండ పగిలి పోయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.