అనంతపురం జిల్లా కేంద్రంలో భారీగా నగదు పట్టుబడింది. విద్యుత్ నగర్ లో నగదు తరలిస్తున్న కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో పెద్ద మొత్తంలో డబ్బును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న మూడు బ్యాగులలో రూ.1.5 కోట్లు దొరికినట్లు సమాచారం. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.