గుజరాత్లోని రాజ్కోట్లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నానామోవా రోడ్లోని గేమ్జోన్లో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 9 మంది మృతదేహాలను బయటకు తీశారు. గేమ్జోన్లో ఉపయోగించే క్రీడా పరికరాలు రబ్బరు, ప్లాస్టిక్తో చేసినవి కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి.