’వాలంటీర్ల వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు, వారు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం‘ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. కొత్తపేటలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పాల్గొని ప్రసంగించారు. ’’మద్యం నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానని జగన్ అన్నారు. ఆ పని చేశారా? మద్య నిషేధం చేయకపోతే వైసీపీకి ఓట్లు అడిగే హక్కు లేదు. బాబాయ్ను గొడ్డలితో చంపి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్కి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా?‘‘ అని అన్నారు.